శ్రీమాన్ శ్రీ వానమామలై వరదాచార్యుల వారు వరంగల్ జిల్లా, హనుమకొండ మండలం, మడికొండ గ్రామంలో శ్రీ బక్కయ్య శాస్త్రి - సీతమ్మ దంపతులకి ఆగష్టు 16, 1912 నాడు జన్మించారు.       సంస్కృతాంధ్ర సాహిత్యం, తార్కికం, వేదాంతం, వ్యాకరణాలను అభ్యసించాడు. సంస్కృతం, తెలుగు, ఉర్దూ, హిందీ, ద్రవిడం, మరాఠీ, ఇంగ్లీషు భాషలలో పట్టు సాధించాడు. హరికథాగానంలో ప్రావీణ్యతను సంతరించుకున్నారు.   శ్రీమద్భాగవతం అనే మహా గ్రంధాన్ని రచించిన శ్రీ పోతన గారి జీవిత చరిత్ర ని శ్రీమాన్ శ్రీ వానమామలై వరదాచార్యుల వారు రచించి గానం చేసారు.  ఆ అద్భుత రచనకి ఆయనకి అభినవ పోతన అనే బిరుదు లభించింది. వరదాచార్యుల వారి జీవిత చరిత్ర ని శ్రీ పెండ్యాల కిషన్ శర్మ గారు , శ్రీ వరదాభ్యుదయం  అనే పద్య కావ్యం లో రచించారు.      తెలుగు సాహిత్య చరిత్ర లో వరదాచార్యుల వారిది ఒక విలక్షణ స్థానం.      ఆయన రాసిన మణిమాల గ్రంథాన్ని ఆంధ్రసారస్వతపరిషత్తు వారి ఆంధ్ర విశారద పరీక్షకు పాఠ్యాంశంగా ఉంచారు.    పురస్కారాలు, సత్కారాలు  1968లో పోతనచరిత్రము గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు.  1971లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ విశిష్ట ...